హీరోగా పేరొచ్చినా అమ్మ చెబుతుండేది కష్టం నీదే ప్రతిఫలం నీదే: Jr.NTR

హీరోగా పేరొచ్చినా అమ్మ చెబుతుండేది కష్టం నీదే ప్రతిఫలం నీదే: Jr.NTR

స్టూడెంట్‌ నెం.1 సినిమాతో హీరోగా ఎంటర్ అయిన జూ. ఎన్టీఆర్‌ ఆది, సింహాద్రి సినిమాలతో తిరుగులేని మాస్‌ హీరోగా ఎదిగిపోయాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇటీవల ‘దేవర’ సినిమాతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దేవర సినిమాలో ఎన్టీఆర్‌  ద్విపాత్రాభినయంలో తన నటనతో మెప్పించాడు. నటుడిగా, డ్యాన్సర్‌గా ఎన్టీఆర్‌కు మంచి పేరుంది. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్‌ వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ పెర్‌ఫార్మర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజు తాను నటనలో, డ్యాన్సుల్లో ఓ ప్రత్యేకత సంపాందించుకోడానికి కారణం తన అమ్మే అంటున్నాడు జూ.ఎన్టీఆర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  నీ కంటూ ఏదైనా స్పెషాలిటీ ఉన్నప్పుడే, నీదంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకుంటేనే నలుగురిలో గుర్తింపు వస్తుందని చెబుతుండేది. ఆమె మాటల ఇన్‌స్పిరేషన్‌తోనే కూచిపూడి నేర్చుకున్నాను. అమ్మ నుంచే అందరితో మాట్లాడటం తెలుసుకున్నా. చాలామంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడానికి రకరకాల సాకులు చెబుతూ ఉంటారు. మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లమనేది. ఏ విషయమైనా సొంతంగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆమెప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాల నడుమనే ఎదగడం గొప్పతనం అని చెబుతుండేది. కష్టపడ్డ వారే ప్రతిఫలం అనుభవించాలి అంటుండేది. అందుకే నాకు హీరోగా ఎంతటి పేరొచ్చినా అమ్మ అసలు బయటికి రాదు. కష్టం నీదే కాబట్టి ప్రతిఫలం కూడా నీదే అనేది అని అమ్మ గురించి విశేషాలను చెప్పుకొచ్చారు ఎన్టీఆర్‌.

administrator

Related Articles