‘కూలీ’ నుండి అప్‌డేట్ రాబోతోంది!

‘కూలీ’ నుండి అప్‌డేట్ రాబోతోంది!

తమిళ హీరో రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా నుండి ఇప్పుడు ఓ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమా కొత్త అప్‌డేట్‌ను ఏప్రిల్ 4న అనౌన్స్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ అప్‌డేట్  ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, కింగ్ నాగార్జున, శ్రుతి హాసన్, సత్యరాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

editor

Related Articles