యాక్సిడెంట్ తర్వాత నాలో మార్పు వచ్చింది..

యాక్సిడెంట్ తర్వాత నాలో మార్పు వచ్చింది..

‘జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు రావడం సహజం. కుదుపులు లేకుండా ప్రయాణం సాగదు. నా జీవితంలో పెద్ద యాక్సిడెంట్ ఓ కుదుపు. దానివల్ల చాలా విషయాలు నేర్చుకున్నా అంటోంది నభా నటేష్‌. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ సోలో బ్రతుకే సో బెటర్‌, అల్లుడు అదుర్స్‌, మ్యాస్ట్రో, డార్లింగ్‌ సినిమాల రూపంలో పరాజయాలు పలకరించాయి. ఈ బాధ నుండి తేరుకునే లోపే నభా నటేష్‌కు యాక్సిడెంట్‌ అయ్యింది. సర్జరీలు కూడా అయ్యాయి. దాంతో ఓ ఏడాదిపాటు సినిమాలకు దూరం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం నభా తేరుకుంది. ప్రస్తుతం నిఖిల్‌తో ‘స్వయంభూ’ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల జిమ్‌లో తాను వర్కవుట్‌ చేస్తున్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి, కామెంట్‌ని కూడా జత చేసింది నభా. ‘యాక్సిడెంట్‌ తర్వాత, తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా టైమ్ పట్టింది. ఆ క్షణంలో మానసికంగా ఎంతోబాధ అనుభవించా. ఫిట్‌నెస్‌ కోసం శ్రమించా. ఇప్పుడు నా శరీరంపై నాకు అవగాహన వచ్చింది.

editor

Related Articles