హీరో రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా సినిమా గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే రూ.186 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇంతటి విజయం సాధించిన సందర్భంగా మెగా అభిమానులంతా కలిసి రామ్ చరణ్ ఇంటికి వెళ్లి హీరోను కలిశారు. అభిమానుల రాకతో మెగా కంపౌండ్ మొత్తం అంతా సందడిగా మారింది. రామ్ చరణ్ కూడా తన భవనం పైనుండి అభిమానులను పలకరించాడు. అయితే ఎంతోదూరం నుండి వచ్చిన అభిమానుల కోసం రామ్చరణ్ భోజనం ఏర్పాటు చేశారు. అభిమానులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోమని రామ్చరణ్ తన సిబ్బందికి చెప్పి చేయించారు.
- January 11, 2025
0
249
Less than a minute
Tags:
You can share this post!
administrator

