సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ పిటిషన్పై అల్లు అర్జున్కి బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు పిటిషన్లపై నేడు విచారణ జరిగింది. అల్లు అర్జున్ తరఫు లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలు ధర్మాసనంకు వినిపించారు. అయితే ఇరు పక్షాల వాదానలు విన్న నాంపల్లి కోర్టు కొంత టైమ్ తీసుకుందామని తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది.
- December 30, 2024
0
137
Less than a minute
Tags:
You can share this post!
administrator


