లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన గోల్డెన్ బ్లాక్బస్టర్ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ఎంతో హార్ట్ టచింగ్గా ఉందని, ట్రైలర్ లేకుండానే సినిమాను విడుదల చేసి హిట్ సాధించడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. సింగీతం గారి ప్రతి సినిమా ఒక మైలురాయిగా నిలిచిందని, ‘ఆదిత్య 369’, ‘పుష్పక విమానం’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాల సరసన ‘సింగ్ గీతం’ కూడా నిలుస్తుందని అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆయన కెరీర్లోనే అత్యుత్తమ కృషిలో ఒకటిగా నిలుస్తుందని ప్రశంసించారు. సింగీతం గారు మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని, అవకాశం వస్తే ఆయన బృందంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అనిల్ రావిపూడి వెల్లడించారు.
- June 15, 2026
0
139
Less than a minute
You can share this post!
editor

