1990ల ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ‘రిమ్జిమ్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్లో బిజీగా ఉంది. హేమ్ సుందర్ దర్శకత్వంలో, జి. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ సినిమా ‘అస్లీదమ్’ ట్యాగ్లైన్తో ఆకట్టుకుంటోంది. స్నేహం, ప్రేమ, గ్యాంగ్స్టర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమా రియలిస్టిక్ టోన్, భావోద్వేగాల మేళవింపుతో ప్రేక్షకుల కోసం తీర్చిదిద్దబడింది.
ప్రధాన పాత్రల్లో అజయ్ వేద్ మరియు వ్రజన నటిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విజేత రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో కనిపించి రెండు పాటలు పాడడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
సాంకేతికంగా సంగీతం: కొక్కిలగడ్డ ఇఫ్రాయిం, సినిమాటోగ్రఫీ: వాసు పెండం, ఎడిటింగ్: పెనుమత్స రోహిత్ సమన్వయంతో ఈ మూవీ రూపొందుతోంది. ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై నిర్మితమైన రిమ్జిమ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


