హీరో జయం రవి ఇల్లు వేలం..

హీరో జయం రవి ఇల్లు వేలం..

కోలీవుడ్ నటుడు జయం రవి (రవి మోహన్)కు భారీగా అప్పులు ఉన్నట్లు తెలిసింది, బ్యాంకు అధికారులు ఇంటికి, కారుకి జప్తు నోటీసులు అతికించడంతో సినీ వర్గాల్లో సంచలనం. నటుడు రవి మోహన్ కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. తాజాగా ఆయన ఇంటికి, స్టూడియోకు బ్యాంకు అధికారులు జప్తు నోటీసులు అతికించారు. వివరాల ప్రకారం, చెన్నై ఈసీఆర్‌లో జయం రవి కొనుగోలు చేసిన బంగ్లా కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన లోన్‌కు గత 10 నెలలుగా ఈఎంఐలు చెల్లించకపోవడంతో రూ.7.64 కోట్ల బాకీ ప‌డ్డ నేప‌థ్యంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ జప్తు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్ర‌మంలో బ్యాంకు అధికారులు రవి మోహన్ ఇల్లు, స్టూడియో వద్ద నోటీసులు అతికించారు. అయితే తేనాంపేటలోని రవి మోహన్ స్టూడియోస్ వద్ద అతికించిన నోటీసును సిబ్బంది తొలగించడంతో అక్కడ కాస్త‌ గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఆ బంగ్లాలో రవి భార్య ఆర్తి రవి తన పిల్లలతో పాటు నివాసం ఉంటున్నారు. రవి – ఆర్తి విడాకుల కేసు కోర్టులో కొనసాగుతుండగా, ఈ పరిస్థితిలో ఇల్లు వేలం వేస్తే ఆమె పిల్లలతో ఎక్కడ ఉంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రవిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

editor

Related Articles