ప్రస్తుతం మన టాలీవుడ్ నుండి రిలీజ్కి రాబోతున్న లేటెస్ట్ సినిమాల్లో తేజ సజ్జ హీరోగా రితిక నాయక్ హీరోయిన్గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన భారీ సినిమా “మిరాయ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా ఈ నెల 12న గ్రాండ్గా రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా రిలీజ్కి ముందే పెట్టిన బడ్జెట్తో పెద్ద మొత్తంలోనే కేవలం ఓటిటి, శాటిలైట్ హక్కులతో రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి 60 కోట్లకి పైగా బడ్జెట్ పెడితే అందులో 45 కోట్లు మొత్తం ఓటిటి, శాటిలైట్ హక్కులతోనే వచ్చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో మిరాయ్కి నెలకొన్న డిమాండ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి థియేటర్స్లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి గౌర హరి సంగీతం అందించగా మంచు మనోజ్ విలన్గా నటించాడు.

- September 3, 2025
0
49
Less than a minute
You can share this post!
editor