హీరోయిన్ రష్మిక ఇటీవలి కాలంలో నటించిన అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాయి. రీసెంట్గా వచ్చిన కుబేర సినిమా కూడా పెద్ద విజయం సాధించింది. కుబేర సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కగా, ఇందులో ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 20న విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. డే బై డే టికెట్ల గ్రాస్ కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా ఎక్కువగా కలెక్షన్లు రాబడుతోంది. తెలుగు, ఓవర్సీస్లో మాత్రం కుబేర దుమ్ముదులిపేస్తోంది. ఇప్పటికే అరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టుగా సమాచారం. ‘కుబేరా’ సినిమా బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్కి హీరో చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నటులు నాగార్జున, ధనుష్లపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ఈవెంట్లో రష్మిక మందన్నపై చిరంజీవి, నాగార్జున చేసిన కామెంట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగార్జున మాట్లాడుతూ, శేఖర్ కమ్ముల ఇచ్చిన ఈ పాత్ర మొదట ఇబ్బందిగా అనిపించినా, నా పెర్ఫార్మెన్స్కి మంచి స్పందన రావడంతో చాలా సంతృప్తిగా ఉంది. ఆ క్రెడిట్ పూర్తిగా శేఖర్కే చెందుతుంది అన్నారు. ఇక రష్మిక గురించి మాట్లాడుతూ.. ఆమెను అందరూ నేషనల్ క్రష్ అంటారు, ఇప్పటి నుండి నాకు క్రష్. క్షణక్షణంలో శ్రీదేవి ఎలా కనిపించారో, రష్మిక ఈ సినిమాలో అలా కనిపించింది అని వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై రష్మిక ఎంతో సంతోషించింది. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా రష్మికపై ప్రశంసలు కురిపిస్తూ ‘నేను చెప్పాల్సింది నువ్వే చెప్పేశావ్ నాగ్. రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు… నా క్రష్ కూడా. నీ మొదటి సినిమా ఈవెంట్కి కూడా నేనే గెస్ట్గా వచ్చాను. అప్పటి నుండి నీ అభినయాన్ని గమనిస్తున్నా. సినిమా సినిమాకి నీ ఇమేజ్ పెరుగుతూనే ఉంది. కుబేరా సినిమాలో రష్మిక మొదట్లో మోసపోయే సీన్ చూస్తే నాకు సౌందర్యని గుర్తుకు తెచ్చింది. క్లైమాక్స్ ముందు చిన్న పిల్లాడిని చేతిలో పట్టుకున్నప్పుడు నీ యాక్టింగ్ అసాధారణంగా ఉంది.
- June 23, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor

