‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన సినిమా జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ‘టిల్లు స్క్వేర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఈ అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. దీంతో ఈ సినిమా వలన డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు భారీ నష్టాలను చవి చూశారు. ఈ నేపథ్యంలోనే, ‘జాక్’ సినిమా నిర్మాతలకు జరిగిన నష్టంలో తన వంతు బాధ్యతగా సిద్ధు జొన్నలగడ్డ అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు తీసుకున్న పారితోషికంలో సగం, అంటే రూ. 4 కోట్ల రూపాయలను నిర్మాతలకు తిరిగి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘జాక్’ సినిమాకు సిద్ధు మొత్తం రూ. 8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం. అందులో సగం తిరిగి ఇవ్వడం ద్వారా ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. అయితే ఈ వార్తలపై సిద్ధు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా, థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ, ‘జాక్’ సినిమా ఓటీటీలో మంచి స్పందన రాబడుతోంది. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
- June 4, 2025
0
86
Less than a minute
Tags:
You can share this post!
editor

