రెండో పాటను రిలీజ్ చేసిన ‘జాను మేరీ జాను’..

రెండో పాటను రిలీజ్ చేసిన ‘జాను మేరీ జాను’..

రాజ్‌ తరుణ్‌ హీరోగా రూపొందుతోన్న క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పాంచ్‌ మినార్‌’. రామ్‌ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్‌.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జాను మేరీ జాను..’ అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, శేఖర్‌చంద్ర స్వరపరిచారు. వినాయక్‌ ఆలపించారు. రాజ్‌ తరుణ్‌, హీరోయిన్‌ రాశి సింగ్‌ కెమిస్ట్రీ ఈ పాటలో ఆసక్తికరంగా ఉంది. అజయ్‌ఘోష్‌, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, నితిన్‌ ప్రసన్న, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాది.

editor

Related Articles