టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 1960ల చివర్లో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన కథ ఆధారంగా ఈ సినిమా రాబోతోంది. మరపురాని అనుభూతిని కలిగించే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి భోగి అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఫస్ట్ స్పార్క్ అంటూ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేసింది. ‘‘ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది’’ అని వీడియోలో తెలిపారు. ఈ వీడియో చూస్తుంటే శర్వానంద్ చాలారోజుల తర్వాత మాస్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు శర్వానంద్. మే మొదటివారం నుంచి షూటింగ్ శరవేగంగా ప్రారంభంకాబోతుండగా.. ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల్లో ఓ భారీ సెట్ను సిద్ధం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించబోతోంది. గతంలో శర్వానంద్, అనుపమ కలిసి శతమానం భవతి అనే సినిమాలో నటించారు. దిల్ రాజ్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ జోడి మళ్లీ జత కడుతుండడంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి కెమెరా: సౌందర్ రాజన్.ఎస్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: లక్ష్మీ రాధామోహన్.
- April 30, 2025
0
67
Less than a minute
Tags:
You can share this post!
editor

