‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలైందీ శ్రద్ధాకపూర్. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ – ప్రశాంత్నీల్ కాంబోలో రూపొందుతున్న ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో శ్రద్ధాకపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యారు. ఆయన్ని మునుపెన్నడూ చూడని విధంగా అత్యంత శక్తివంతమైన పాత్రలో ఆవిష్కరిస్తూ దర్శకుడు ప్రశాంత్నీల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని అంటున్నారు. ఈ సినిమా ద్వితీయార్ధంలో వచ్చే కీలకమైన పాత్ర కోసం చిత్ర బృందం శ్రద్ధాకపూర్ను సంప్రదించినట్లు తెలిసింది. తక్కువ నిడివి కలిగిన అతిథి పాత్రే అయినా కథను మలుపుతిప్పే విధంగా ఉంటుందని అంటున్నారు. రవిబస్రూర్ స్వరకర్త. వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- May 13, 2025
0
157
Less than a minute
Tags:
You can share this post!
editor

