శుభ‌వార్త చెప్ప‌బోతున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

శుభ‌వార్త చెప్ప‌బోతున్న వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి

హీరో వ‌రుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ క్రేజీ జంట‌ల‌లో ఒక‌రు. వీరిద్ద‌రు సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపి, ఆ త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కారు. నవంబర్ 1, 2023లో వాళ్ళిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన ఈ జంట స‌డెన్‌గా త‌మ నిశ్చితార్థం విష‌యాన్ని ప్ర‌క‌టించి ఆ త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించారు అనంత‌రం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమా చేశారు. ఈ రెండు సినిమాల షూటింగ్ స‌మ‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ఏర్ప‌డి అది ప్రేమ వ‌ర‌కు వెళ్లింది. ఇక వీరిద్ద‌రు కూడా పెద్ద‌ల‌ని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్ర‌స్తుతం వారు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ జంట ఓ గుడ్ న్యూస్ అందించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ జంట పేరెంట్స్ కాబోతున్నారంటూ ముచ్చ‌టించుకుంటున్నారు. కాని లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే… స్టార్ కపుల్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి తండ్రి కాబోతున్నార‌ని లేటెస్ట్ అప్‌డేట్.

editor

Related Articles