హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ క్రేజీ జంటలలో ఒకరు. వీరిద్దరు సీక్రెట్గా ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. నవంబర్ 1, 2023లో వాళ్ళిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన ఈ జంట సడెన్గా తమ నిశ్చితార్థం విషయాన్ని ప్రకటించి ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించారు అనంతరం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమా చేశారు. ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్లింది. ఇక వీరిద్దరు కూడా పెద్దలని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ జంట ఓ గుడ్ న్యూస్ అందించబోతున్నారని తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ జంట పేరెంట్స్ కాబోతున్నారంటూ ముచ్చటించుకుంటున్నారు. కాని లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… స్టార్ కపుల్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి తండ్రి కాబోతున్నారని లేటెస్ట్ అప్డేట్.
- May 1, 2025
0
250
Less than a minute
Tags:
You can share this post!
editor

