క్రైమ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుడు..

క్రైమ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శకుడు..

“మనం ఫైనాన్షియల్‌ క్రైమ్‌ గురించి వింటూ ఉంటాం. ఎలా జరుగుతాయో తెలీదు. ఈ సినిమాలో వాటిని దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ కథలో రెండు ప్రపంచాలుంటాయి. ఒకటి బ్యాంక్‌ ప్రపంచం, రెండోది గ్యాంగ్‌స్టర్‌ ప్రపంచం. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తా.” అని హీరో డాలీ ధనంజయ్‌ తెలిపారు. సత్యదేవ్‌తో కలిసి ఆయన నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘జీబ్రా’. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. ఎస్‌.ఎన్‌.రెడ్డి, ఎస్‌.పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం నిర్మాతలు. నవంబర్‌ 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డాలీ ధనంజయ్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘వాణిజ్య విలువల కలబోత ఈ సినిమా. సత్యదేవ్‌తో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఇందులో ప్రతి పాత్ర కీలకమే.’ అని చెప్పారు. రవి బస్రూర్‌ సినిమాకు కొత్త సౌండ్‌ ఇచ్చారనీ, నిర్మాతలు పాషన్‌తో తీసిన ఈ సినిమా తప్పక సక్సెస్‌ అవుతుందని డాలీ ధనంజయ్‌ నమ్మకంగా చెప్పారు.

administrator

Related Articles