పూర్ణచందర్‌పై ఆరోప‌ణ‌లు చేసిన స్వేచ్ఛ కూతురు..

పూర్ణచందర్‌పై ఆరోప‌ణ‌లు చేసిన స్వేచ్ఛ కూతురు..

యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. త‌న కూతురి చావుకి పూర్ణ చందర్ కార‌ణం అంటూ స్వేచ్ఛ త‌ల్లిదండ్రులు ఆరోపించారు. ఆ త‌ర్వాత పూర్ణ చంద‌ర్ లేఖ విడుద‌ల చేయ‌గా, ఇందులో స్వేచ్ఛ త‌న త‌ల్లిదండ్రుల వ‌ల‌న మాన‌సిక ఆవేద‌న చెంది సూసైడ్ చేసుకుంద‌ని ఉంది. పూర్ణ చందర్ మాత్రం త‌న లేఖ‌లో స్వేచ్ఛ కుమార్తెను తన క‌న్న కూతురిలా చూసుకున్నానని.. స్కూల్లో చేర్పించి ఫీజులు కడుతున్నానని పేర్కొన్నాడు. స్వేచ్ఛ కూతురు ఫంక్ష‌న్ కోసం  తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టానని కూడా అన్నాడు.. కానీ స్వేచ్ఛ కుమార్తె వ‌ర్షెన్ మాత్రం భిన్నంగా ఉంది. పూర్ణచందర్ ప్రవర్తన ఏ మాత్రం బాగా ఉండేది కాదని మీడియాకు చెప్పుకొచ్చింది. ఇక ఇదే స‌మ‌యంలో పూర్ణచందర్‌ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్‌ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందని, ముందు వారిద్దరి మధ్య సంబంధం గురించి తనకు తెలియదని, ఎప్పుడైతే వారి వ్యవహారం తెలిసిందో అప్పుడే పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు. అయితే పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు పూర్తి అసత్యమని, అరణ్యను పూర్ణచందర్‌ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న స్ప‌ష్టం చేసింది. స్వేచ్ఛ నన్ను మానసికంగా ఎంతో టార్చర్‌ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్‌ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని భయపెట్టిందని స్వ‌ప్న స్ప‌ష్టం చేసింది. నా భర్త పూర్ణచందర్‌ నిర్దోషి, అమాయకుడంటూ స్వ‌ప్న కామెంట్ చేయ‌డం గ‌మ‌న‌ర్హం. అయితే స్వేచ్ఛ ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. దాంతో పూర్ణచందర్‌ను అరెస్టు చేయ‌లేక‌పోయారు. కానీ అనూహ్యంగా స్వేచ్ఛ కుమార్తె నా పైనా వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు. కుమార్తె ఫిర్యాదుతో పెద్ద చిక్కుల్లోనే ప‌డ్డాడు పూర్ణ చంద‌ర్. స్వేచ్ఛ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పరిశీలనలో అనుమానాస్పద అంశాలు ఏమైనా బయటపడితే.. అవి సంచలనంగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కానీ నిజానిజాలు తేలవని అనుకుంటున్నారు.

editor

Related Articles