Movie Muzz

“పూజా పర్వంతో ‘సూర్య 47’ ఓపెనింగ్!”

“పూజా పర్వంతో ‘సూర్య 47’ ఓపెనింగ్!”

కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు.  తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్ తో కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్స్ లో ఒకటిగా నిలిచింది, అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటించగా, విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జఘరమ్ స్టూడియోస్ ఈ ప్రాజెక్టు కు మద్దతు ఇస్తోంది. సూర్య47 చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.  ఈ కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బంది , పరిశ్రమ నుండి అనేక మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఈ వేడుకకు చిత్ర నిర్మాత జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్ పాండియన్ (2డి ఎంటర్‌టైన్‌మెంట్), నిర్మాతలు ఎస్.ఆర్ ప్రకాష్,   ఎస్.ఆర్ ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) వంటి విశిష్ట అతిథులు హాజరయ్యారు, వీరందరూ సినిమా విజయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పూజ తర్వాత, చిత్రీకరణను ప్రారంభించారు, అధికారికంగా మొదటి షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభమైయింది. ఈ సందర్బంగా దర్శకుడు జితు మాధవన్ మాట్లాడుతూ.. కొత్త పరిశ్రమ, కొత్త ప్రారంభం, అది కూడా సూర్య లాంటి స్టార్‌తో.. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.

editor

Related Articles