టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమా SSMB29 ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా మహేష్ బాబు సరికొత్త మేకోవర్తో ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా నుండి అధికారికంగా ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఓటీటీ రైట్స్ను నెట్ఫ్లిక్స్ అత్యంత భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఒక టాక్ ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో మహేష్బాబు పాత్ర అల్టిమేట్గా ఉండబోతోందని.. ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ సినిమాగా జక్కన్న రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
- July 3, 2025
0
123
Less than a minute
Tags:
You can share this post!
editor

