షూటింగ్‌కి ముందే ఊహాగానాలతో ‘స్పిరిట్‌’ సినిమా..

షూటింగ్‌కి ముందే ఊహాగానాలతో ‘స్పిరిట్‌’ సినిమా..

ప్రభాస్‌ ‘స్పిరిట్‌’  సినిమా షూటింగ్‌ ఇప్పటివరకూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ సినిమాపై వస్తున్న వార్తలు మాత్రం అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులను కూడా ఆలోచింప చేస్తున్నాయి. ఇప్పటికే ‘స్పిరిట్‌’లో సైఫ్‌అలీఖాన్‌, కరీనాకపూర్‌ నటిస్తున్నారనీ, ఈ భార్యభర్తలిద్దరూ ఇందులో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. వాటిని నిజం చేస్తూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఇటీవలే ఈ జంటను కలిశారు. వారికి కథ, పాత్రలు కూడా చెప్పినట్లు బీటౌన్‌ సమాచారం.

ఇప్పుడు ఏకంగా మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో యాక్ట్ చేస్తారన్న విషయం అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇప్పటివరకూ వీటిపై అధికారిక ప్రకటనలు మాత్రం ఇంకా రాలేదు. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ మొదలౌతుందని అంటున్నారు. సందీప్‌రెడ్డి వంగా మార్క్‌ యాక్షన్‌ సీన్స్‌,  వైల్డ్‌ ఎలిమెంట్స్‌తో హాలీవుడ్‌ స్థాయిలో ‘స్పిరిట్‌’ తెరకెక్కనున్నదనీ, దాదాపు 400  కోట్ల బడ్జెట్‌ సినిమా వ్యయంతో సందీప్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. టి.సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతం సమకూర్చుతారు.

editor

Related Articles