టాలీవుడ్ హీరోయిన్ సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. తనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా.. ప్రతీ విషయాన్ని ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటుంది. అలానే తాజాగా సమంత సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇటీవల తాను చికెన్ గున్యా వ్యాధికి గురైనట్లు సమంత తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ వ్యాధి నుండి కోలుకుంటున్నట్టు ఆమె చెప్పింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సమంత షేర్ చేసింది. చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుండి కోలుకోవడం అనేది చాలా ఫన్గా ఉంటుందంటూ సమంత రాసుకొచ్చారు. గతంలో సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. ఖుషి సినిమా టైమ్లో తాను ఈ వ్యాధికి గైరనట్లు ఆమె తెలిపింది. అప్పట్నుంచి తన ఆరోగ్యం క్షీణించిందని చెప్పింది. మయోసైటిస్ చికిత్స కోసం మెడిసిన్స్, ఆయుర్వేదం, భూటాన్లో ప్రకృతి వైద్యం ఇలా రకరకాల పద్ధతుల్ని సమంత తీసుకుంది.

- January 11, 2025
0
33
Less than a minute
Tags:
You can share this post!
editor