బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కాంపౌండ్ నుండి వస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ సినిమాల్లో ఒకటి ‘సికందర్’. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2025 ఈద్ కానుకగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్ను ఇవాళ ఉదయం 11:07 నిమిషాలకు లాంచ్ చేయాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశమంతా సంతాపం ప్రకటిస్తున్న ఈ సమయంలో ఆయన మృతికి సంతాపంగా టీజర్ లాంచ్ ఈవెంట్ను వాయిదా వేస్తున్నాం. టీజర్ను రేపు ఇదే (ఉదయం 11:07) సమయానికి లాంచ్ చేస్తామని అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్. సికిందర్లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫిమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమాని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తుండగా.. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

- December 27, 2024
0
32
Less than a minute
Tags:
You can share this post!
editor