బలగం సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్నారు దర్శకుడు వేణు యెల్దండి. ఆయన తదుపరి సినిమాగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించబోతున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. తెలంగాణ నేపథ్యంలో గ్రామదేవతల చుట్టూ తిరిగే సోషల్ డ్రామా ఇదని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్గా సాయిపల్లవి నటించనున్నట్లు వార్తలొచ్చాయి. కథలోని కొత్తదనం, భావోద్వేగాలు నచ్చడంతో ఆమె ఈ సినిమాకు వెంటనే అంగీకరించిందని కథనాలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా మే లేదా జూన్ నెలలో సెట్స్మీదకు వెళ్లనుంది. అయితే ఆ సమయంలో సాయిపల్లవి డేట్స్ ఖాళీగా లేవని, ఇతర సినిమాలతో ఉన్న ముందస్తు కమిట్మెంట్ కారణంగా ఆమె ‘ఎల్లమ్మ’ నుండి అయిష్టంగానే తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కథానుగుణంగా స్టార్ హీరోయిన్ అవసరం కావడంతో కీర్తి సురేష్, రష్మిక మందన్న వంటి అగ్ర తారలను ఈ సినిమా కోసం సంప్రదించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు.

- March 22, 2025
0
39
Less than a minute
Tags:
You can share this post!
editor