మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన రెట్రో సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక డిజిటల్ ప్లాట్ఫాంలో తన లక్ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. కోలీవుడ్ హీరో సూర్య నటిస్తున్న ప్రాజెక్ట్ రెట్రో. సూర్య 44 గా వస్తోన్న ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ఫ్లిక్స్లో మే 31 నుండి స్ట్రీమింగ్ కానుంది. రెట్రో తెలుగు, తమిళంతో పాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో సందడి చేయనుంది రెట్రో. థియాట్రికల్ రిలీజైన నెల వ్యవధిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా మరి ఎలాంటి స్పందన రాబట్టుకుందనేది చూడాలి. ఈ సినిమాలో పాపులర్ మలయాళ నటుడు జోజు జార్జ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సూర్య హోం బ్యానర్ 2డీ నిర్మించిన ఈ సినిమాకి తిరు, 24, పేటా ఫేం సినిమాటోగ్రఫర్ డీవోపీగా వర్క్ చేశాడు.
- May 26, 2025
0
120
Less than a minute
Tags:
You can share this post!
editor

