పూరి సేతుప‌తి సినిమాలో రాధికా ఆప్టే.. స్పందించిన నటి

పూరి సేతుప‌తి సినిమాలో రాధికా ఆప్టే.. స్పందించిన నటి

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు పూరి జగన్నాథ్ ప్ర‌స్తుతం త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తితో ఒక సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. పూరిసేతుప‌తి అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా.. ‘పూరి కనెక్ట్స్’ బ్యాన‌ర్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ న‌టి ట‌బు ముఖ్య పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర‌బృందం వెల్ల‌డించింది. అయితే ఇటీవ‌ల ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ రాధికా ఆప్టే న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా ఈ వార్త‌ల‌పై స్పందించింది రాధికా ఆప్టే. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌న్నారు. తాను ఈ సినిమాలో భాగమైనట్లు తనకే తెలియదని రాధికా ఆప్టే సరదాగా చెప్పారు. ఇలాంటి ఊహాగానాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని, ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలు చాలా ఫన్నీగా అనిపిస్తాయని వెల్ల‌డించారు. దర్శకుడు పూరి జగన్నాథ్, నటి చార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమాలో విజయ్ సేతుపతిని ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో చూపించనున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమవుతుందని సమాచారం.

editor

Related Articles