గోలీమార్ సినిమాకి సీక్వెల్ తీయ‌బోతున్న పూరీ జ‌గ‌న్నాథ్.?

గోలీమార్ సినిమాకి సీక్వెల్ తీయ‌బోతున్న పూరీ జ‌గ‌న్నాథ్.?

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌కు సూప‌ర్ హిట్ అందించిన గోలీమార్ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డాడు. ఎలాగైన మ‌ళ్లీ హిట్టు కొట్టాల‌నే క‌సితో ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న లేటెస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బ‌య‌టికి వ‌చ్చింది. పూరీ జ‌గన్నాథ్ – గోపీచంద్ కాంబోలో వ‌చ్చిన సూప‌ర్ హిట్ సినిమా గోలీమార్. ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌గా న‌టించ‌గా.. బెల్లంకొండ సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. 2010లో విడుద‌లైన ఈ సినిమా మంచి విజ‌యాన్ని అందుకోవడ‌మే కాకుండా గోపీచంద్ కెరీర్‌లో మ‌రిచిపోలేని సినిమాగా మిగిలింది. పోలీస్ – మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో గంగారాం అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర‌లో ఆక‌ట్టుకున్నాడు గోపీచంద్. అయితే ఈ సినిమా వ‌చ్చి 15 ఏళ్ళవుతున్న త‌ర్వాత ఈ సినిమాకు పూరీ జ‌గ‌న్నాథ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు కూడా పూర్తయిన‌ట్లు తెలుస్తోంది. గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఈ సీక్వెల్‌ను కూడా బెల్లంకొండ సురేష్ నిర్మించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

editor

Related Articles