8 ఏళ్ల తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?

8 ఏళ్ల తర్వాత ప్రభాస్, అనుష్క ట్రీట్!?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అలాగే హీరోయిన్  అనుష్కల జంటకి మన తెలుగు ఆడియెన్స్‌లో ఒక సెపరేట్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వారి కలయికలో వచ్చిన సినిమాలు అన్నిటికీ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అయితే తామిద్దరూ కలిసి చివరిగా కనిపించిన సినిమా “బాహుబలి 2”.  ఆ తర్వాత ఇద్దరు కలిసి స్క్రీన్స్ షేర్ చేసుకోవడం కానీ బయట ఏదన్నా ఈవెంట్‌లో అయినా కలిసిన దాఖలాలు లేవు. కానీ మళ్ళీ 8 ఏళ్ల  తర్వాత ఇద్దరు కలిసి కనిపించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఓ సినిమా కోసమే కానీ నటించేందుకు కాదు. తమ కలయికలో వచ్చిన బాహుబలి సినిమా కలిపి రిలీజ్ చేస్తున్న బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్‌లో కనిపించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనితో చాలాకాలం నుండి మిస్ అవుతున్న ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో కాలమే నిర్ణయిస్తుంది.

editor

Related Articles