రపో 22 టీంలోకి నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ టెక్నీషియన్‌..

రపో 22 టీంలోకి నేషనల్ అవార్డ్‌ విన్నింగ్‌ టెక్నీషియన్‌..

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి ఫేం పి మహేష్‌బాబు  డైరెక్ట్‌ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్‌ రపో 22. టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని.. తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫిమేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. కాగా రామ్‌ ఈ సినిమా కోసం కొత్త టెక్నీషియన్స్‌ను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలిసింది. ఇప్పటికే న్యూ సౌండ్ ఆఫ్‌ తెలుగు సినిమాకు స్వాగతం అంటూ కోలీవుడ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ల ద్వయం వివేక్-మెర్విన్‌ టాలీవుడ్‌కు పరిచయం చేశాడు.

మరోవైపు మేరిక్రిస్మస్‌, మలైకొట్టై వాలిబన్‌తోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్‌ మధు నీలకందన్‌ ఈ సినిమాకి పనిచేయబోతున్నట్టు తెలియజేశాడు. తాజాగా నేషనల్ అవార్డు విన్నింగ్‌ టెక్నీషియన్‌ (ఎడిటర్‌) అక్కినేని శ్రీకర్‌ ప్రసాద్‌ను టీంలోకి తీసుకున్నట్టు ప్రకటించారు. ఈయన ఏడుసార్లు నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం.

editor

Related Articles