అక్కినేని అఖిల్ పెళ్లి పీటలు ఎక్కే సమయం ఆసన్నమైంది. జూన్ 6న అఖిల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో నాగార్జున తన కుమారుడి వివాహానికి పలువురు సెలబ్రిటీలని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించిన నాగార్జున తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి తన చిన్న కొడుకు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా చంద్రబాబును స్వయంగా ఆహ్వానించి వివాహ పత్రిక అందజేశారు. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కూడా నాగార్జున ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. గతేడాది నవంబర్ నెలలో అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరగగా, ఆ విషయాన్ని నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో వారి వివాహం జూన్ 6న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే జరగనున్నట్లు సమాచారం.

- June 3, 2025
0
126
Less than a minute
Tags:
You can share this post!
editor