ఇండస్ట్రీకి వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. ఎప్పటి నుండో ఈ సంప్రదాయం నడుస్తోంది. అయితే ఎక్కువగా సినీ ప్రముఖుల వారసులు ఎంట్రీ ఇస్తుండడం మనం చూస్తున్నాం. స్టార్ హీరోల కూతుళ్లు వెండితెర అరంగేట్రం చేయడం చాలా తక్కువ. ఇప్పుడు మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ వారసురాలి ఎంట్రీ జరగబోతోంది. మలయాళ మోహన్లాల్ కుమార్తె విస్మయ మోహన్లాల్, త్వరలో నటిగా వెండితెరపై అరంగేట్రం చేయనుంది. విస్మయ ‘తుడక్కం’ అనే సినిమాతో హీరోయిన్గా స్క్రీన్కు పరిచయం కాబోతోంది. ఈ సినిమాకి జూడే ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. జూడే ఆంథనీ జోసెఫ్ గతంలో సారాస్, 2018 (కేరళ వరదలు ఆధారంగా తెరకెక్కిన సినిమా) వంటి విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి గుర్తింపు పొందారు. ఈ ప్రాజెక్ట్ను మోహన్లాల్కు అత్యంత సన్నిహితుడైన ఆంటోనీ పెరుంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “విస్మయ మోహన్లాల్ను వెండితెరకు పరిచయం చేయడం మా సంస్థకు గర్వకారణం” అని ఆశీర్వాద్ సినిమాస్ పేర్కొంది. తన కుమార్తె తొలి సినిమా గురించి సూపర్స్టార్ మోహన్లాల్ కూడా సోషల్ మీడియాలో స్పందించాడు. “తుడక్కం సినిమా మీద నీ ప్రేమకు ఇది మొదటి అడుగు. నీ కొత్త ప్రయాణానికి నా తరఫున శుభాకాంక్షలు, విస్మయ” అంటూ మోహన్లాల్ ట్వీట్ చేశాడు. ఆయన అభిమానులూ ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తూ విస్మయకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- July 2, 2025
0
48
Less than a minute
Tags:
You can share this post!
editor

