మనోజ్ తన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు. మనోజ్ భైరవం సినిమాలో నటించగా, ఇందులో నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కించగా, ఈ సినిమా మే 30న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ట్రైలర్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. సినిమా గురించి చెబుతూ ఆ టైంలో తన ఇంట్లో జరిగిన గొడవల గురించి కూడా ప్రస్థావించాడు. మధ్యలో విష్ణు మీద కూడా పరోక్షంగా కౌంటర్లు వేశాడు. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చాను.. కొత్త సినిమాను స్టార్ట్ చేశాను.. రీ లాంచ్ అనుకున్నాను.. కరోనా వచ్చింది.. ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది.. తొమ్మిదేళ్లు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.. కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఇంకా సినిమాలు చెయ్ అన్నా.. కమ్ బ్యాక్ ఇవ్వు అని అంటున్నారు.. ఆ ప్రేమకు నేను సినిమాతోనే సమాధానం ఇస్తాను.. అలానే శివయ్యా అని పిలిస్తే ఆ శివుడు రాడు.. మనసులో తలుచుకుంటే.. మా డైరెక్టర్ లానో, మా నిర్మాతలానో వస్తాడు.. మా మీద నమ్మకంతో 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు అని మనోజ్ చెప్పుకొచ్చారు.
- May 19, 2025
0
142
Less than a minute
Tags:
You can share this post!
editor

