ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఏదన్నా ఉంది అంటే అది హీరో మహేష్బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమానే అని చెప్పాలి. మరి ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా కోసం మహేష్బాబు బీస్ట్ మోడ్లోకి మారుతుండగా ఈ సినిమాలో మళయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఉన్నట్టుగా పలు రూమర్స్ వచ్చాయి. దానిపై తాను కూడా ఒకింత పాజిటివ్గానే రెస్పాన్స్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఇక లేటెస్ట్గా తన పోస్ట్ ఒకటి ఇపుడు వైరల్గా మారింది. “దర్శకునిగా వర్క్ చేసిన సినిమా అన్నిపనులు పూర్తిచేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దీని తర్వాత నటుడుగా మళ్ళీ తెరపై కనిపించేందుకు సిద్ధం అవ్వడం. నీ ప్రాంతానికి చెందిన భాష కాకుండా ఒక భాషలో లాంగ్ లెంగ్త్ డైలాగ్స్ ఉన్నాయి సో నువ్ కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నావు” అంటూ తన ఫ్రెష్ లుక్ని చూపిస్తూ పృథ్వీ రాజ్ సుకుమారన్ చేసిన పోస్ట్ ఇపుడు వైరల్గా మారింది. ప్రభాస్తో సలార్ 2 ఇప్పట్లో లేదు. అలాగే ఇతర భాష అంటున్నాడు కాబట్టి ఇది డెఫినెట్గా మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్నే అని చెప్పవచ్చు. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

- March 4, 2025
0
18
Less than a minute
Tags:
You can share this post!
editor