మలయాళ గాయకుడు జయచంద్రన్‌ ఇకలేరు

మలయాళ గాయకుడు జయచంద్రన్‌ ఇకలేరు

ప్రముఖ మలయాళ గాయకుడు పి.జయచంద్రన్‌ (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ త్రిశ్శూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జయచంద్రన్‌ మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 16 వేలకు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆయన పాడిన ఎన్నో పాటలు శ్రోతల్ని అలరించాయి. ‘రోజావే చిన్ని రోజువే..’ (సూర్యవంశం), హ్యాపీ హ్యీపీ బర్త్‌డేలు.. (సుస్వాగతం), ‘అనగనగా ఆకాశం ఉంది..’ (నువ్వేకావాలి).. ఈ నువ్వేకావాలి సినిమాలో పాట మాత్రం చాలా బాగా పాపులర్ అయింది, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో తెలుగు పాటలు ఆయన గళం నుండి వెలువడి విశేషాదరణ పొందాయి. ‘ఊరు మనదిరా’ (2022) చిత్రంలోని ‘నా చెల్లి చంద్రమ్మ..’ ఆయన తెలుగులో పాడిన చివరి పాట. జయచంద్రన్‌ మరణం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.

editor

Related Articles