‘మహానటి’ సినిమాతో తెలుగుతోపాటు తమిళంలోనూ సూపర్ ఫేం సంపాదించుకుంది నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తి సురేష్. వరుణ్ ధావన్తో కలిసి ‘బేబీ జాన్’ చిత్రంలో నటించింది. తెలుగు, తమిళంలో వరుస చిత్రాలతో బిజీగా మారిపోయింది. ఇటీవలే బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ ధావన్తో కలిసి ‘బేబీ జాన్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ‘బేబీ జాన్’ సినిమాలో అవకాశం గురించి మహానటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. స్టార్ నటి సమంత కారణంగానే తనకు ‘బేబీ జాన్’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామ్కు థ్యాంక్స్ చెప్పింది. ‘బేబీ జాన్’ సినిమా ‘తెరి’ సినిమాకు రీమేక్గా రూపొందించిన విషయం తెలిసిందే. దీని తమిళ వెర్షన్లో హీరోయిన్గా సామ్ నటించింది. ఈ సినిమా హిందీ రీమేక్ చేయాలని భావించిన చిత్ర బృందం సమంతను సంప్రదించగా.. సామ్ తన పేరును సూచించిందని కీర్తి సురేష్ తాజాగా వెల్లడించింది. తమిళంలో సమంత పోషించిన పాత్రను హిందీలో తాను చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. ఈ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి అని పేర్కొంది. ఈ సినిమా కోసం సమంత తన పేరు చెప్పగానే తాను భయపడ్డానని… అయితే సమంత తనను ఎంతో ప్రోత్సహించిందని పేర్కొంది. సమంత ఇచ్చిన ధైర్యంతోనే సినిమాను పూర్తి చేశానని చెప్పుకొచ్చింది.

- December 31, 2024
0
13
Less than a minute
Tags:
You can share this post!
editor