‘కాంతార’ ఫేమ్ కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి తెలుగు, కన్నడలో వరుస సినిమాలతో మనముందుకు రానున్నారు. ఇటీవల ది రానా దగ్గుబాటి షోలో రిషబ్ శెట్టి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ షోలోనే ఆయన మాట్లాడుతూ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి పని చేయాలని ఉందని తన మనసులో మాటను బయట పెట్టారు. సందీప్ వంగలా ఎవరూ ఆలోచించలేరని, ప్రశంసలు కురిపించారు. ఆయన డైరెక్షన్లో ఏ సినిమా అయినా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ప్రస్తుతం రిషబ్ శెట్టి ది ప్రైడ్ ఆఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే హిస్టారికల్ డ్రామా సినిమా కూడా చేస్తున్నారు. సందీప్ సింగ్ దీన్ని తెరకెక్కించనున్నారు. “ఇది కేవలం సినిమానే కాదు, మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేసి వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథ” అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2027 సంవత్సరంలో జనవరి 21న రిలీజ్ కానుంది. ప్రస్తుతం ‘జై హనుమాన్’, ‘కాంతారా’ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి.