కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి నుండి కొందరు త్రుటిలో ప్రాణాలను రక్షించుకున్నారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది. ఈ దాడిలో సుమారు 26 మంది టూరిస్ట్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా బయటపడిన వారిలో ఓ సెలబ్రిటీ జంట కూడా ఉంది. ప్రముఖ నటులు దీపిక కక్కర్ -షోయబ్ ఇబ్రహిమ్ జంట తమ కుమారుడు రుహాన్తో కలిసి కశ్మీర్ ట్రిప్కు వెళ్లారు. ట్రిప్లో భాగంగా తమ బాబుతో కలిసి లోయలో ఎంతో సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం అక్కడ ఉగ్రదాడి జరిగిన తర్వాత నెటిజన్లు, అభిమానులు వీరి గురించి ఎంక్వైరీ చేశారు. దీంతో షోయబ్ సోషల్ మీడియా వేదికగా తాము క్షేమంగా బయటపడ్డామంటూ ఓ పోస్టు పెట్టారు. ‘మేం క్షేమంగా ఉన్నాం, ఎవరూ ఆందోళన పడకండి’ అంటూ ఇన్స్టా స్టోరీస్లో రాసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, కశ్మీర్లోని పెహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ పట్టణ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం పర్యాటకులే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. ఈ అమానవీయ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి మనీశ్ రంజన్, ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రసంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది.
- April 23, 2025
0
72
Less than a minute
Tags:
You can share this post!
editor

