‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

‘విశ్వంభర’ గ్రాఫిక్స్‌పై ఇంట్రెస్టింగ్ న్యూస్!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్‌గా ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి గత ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కి వచ్చిన టీజర్‌కి కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. మరి వీటి విషయంలో కొంచెం కంప్లైంట్స్ రాగా మేకర్స్ దీనిపైనే చాలా ఎక్కువ ఫోకస్ చేసి ఇంత సమయం తీసుకున్నారు. అయితే విశ్వంభర విషయంలో ఈ గ్రాఫిక్స్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. దీంతో హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ వారు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారట. తాము సాలిడ్ ఔట్‌పుట్ సినిమాకి అందిస్తున్నారట. అలాగే ఈ పనులు ఒక కొలిక్కి వచ్చాక మాత్రమే రిలీజ్ డేట్ ఎప్పుడు ఏంటి అనేది అనౌన్స్ చేస్తారు. మరి మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కి ఒక గ్రాండ్ ఎంట్రీ వచ్చేలా ఉందనే చెప్పాలి.

editor

Related Articles