హీరోయిన్ సాయిపల్లవి గురించి, ఆమె సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్గా ఉండి తాను పోషించే ప్రతీ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. సాయిపల్లవి ఓ సినిమాకు ఒప్పుకుందంటే అందులో మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఆదరిస్తారు. గతేడాది ‘అమరన్’తో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ఇష్టాయిష్టాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయని, తాను కూడా వాటికి అతీతురాలినేనని చెప్పింది. పబ్లిక్ ప్లేస్లోకి వెళ్లినప్పుడు అందరూ తననే చూస్తున్నారనే భయం, కామెంట్ చేస్తున్నారనే భావన వల్ల కాస్త బిడియంగానూ ఉంటుందని తెలిపింది. తనను ఎవరైనా అభినందించినా ఏదో తెలియని టెన్షన్కి గురౌతునట్లు అనిపిస్తుందని పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా తన అనుమతి లేకుండా ఎవరైనా ఫొటోలు తీస్తే అస్సలు నచ్చదని, అడిగి తీసుకుంటే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చింది. ఒక్కోసారి ఓవర్థింకింగ్ వల్ల ఆలోచనలు ఎక్కడికో వెళ్లిపోతాయని, వాటిని కంట్రోల్ చేయడం కోసం నిత్యం ధ్యానం చేస్తున్నానని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగులో తండేల్, కుబేర సినిమాల్లో నటిస్తోంది.

- January 23, 2025
0
27
Less than a minute
Tags:
You can share this post!
editor