హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలోని కొందరు హీరోలపై చేసిన సరదా కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయి. విష్వక్ సేన్ హీరోగా రాబోతున్న ‘మెకానిక్ రాకీ’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో పాల్గొన్న మీనాక్షి కొందరు హీరోలపై తన అభిప్రాయన్ని సరదాగా చెప్పుకొచ్చింది. మహేష్ గురించి చెబుతూ.. ‘మహేష్బాబు క్రమశిక్షణగా ఉంటారు. అదే తమిళ స్టార్ హీరో విజయ్ గురించి చెబుతూ.. విజయ్ ఎప్పుడూ ఒకేలా ఉంటారు’ అని చెప్పింది. ఇక మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ గురించి చెబుతూ.. ‘దుల్కర్ సల్మాన్ వినయం అంటే నాకు ఇష్టం. వరుణ్ తేజ్ది పూర్తిగా జెంటిల్మన్ నేచర్. ఇక విష్వక్సేన్ ఎప్పుడూ సరదాగా ఉంటారు. ఎనర్జిటిక్గా ఉంటూ సెట్లో సందడి క్రియేట్ చేస్తుంటారు’ అంటూ మీనాక్షి చౌదరి తెలిపింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే లక్కీ భాస్కర్ సినిమాతో విజయాన్ని కూడా అందుకుంది. మరి ‘మెకానిక్ రాకీ’ కూడా హిట్ అవుతుందేమో వెయిట్ అండ్ సీ.

- November 18, 2024
0
46
Less than a minute
Tags:
You can share this post!
administrator