హీరో గోవిందా, ఆయన భార్య సునీత అహూజా విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇటీవల మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. బాంద్రా (ముంబై)లోని కుటుంబ న్యాయస్థానంలో ఇప్పటికే వీరికి సంబంధించిన పంచాయతీ నడుస్తోందని ఒక పత్రిక తన కథనంలో పేర్కొంది. సునీత గోవిందాపై క్రూరత్వం, వ్యభిచారం, విడిచిపెట్టి ఉండటం వంటి ఆరోపణలు చేసినట్లు పలు విధాలుగా వార్తలొచ్చాయి. ఈ కేసులో కౌన్సిలింగ్ సెషన్లు కూడా జరుగుతున్నాయని, అయితే గోవిందా వాటికి హాజరుకాలేకపోతున్నారని, సునీత మాత్రం ప్రతి సెషన్కు హాజరవుతూ వస్తున్నారని కథనాలు చెబుతున్నాయి. ఈ వార్తలని గోవిందా కుటుంబ స్నేహితుడు ప్రహ్లాద్ నిహలానీ, ఆయన కుమార్తె టీనా అహూజా పూర్తిగా ఖండించారు. వినాయక చవితి సందర్భంగా గోవిందా, సునీత కలిసి లార్డ్ గణేశుని దర్శించుకున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సునీతా అహూజా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. “మా మధ్య ఎలాంటి సమస్యలు లేవు. గణపతిని దర్శించుకోవడానికి వచ్చాము. మా విడాకులు అనేది ఏమీ నిజం కాదు” అని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా, ఆమె మాట్లాడుతుండగా గోవిందా నవ్వుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇది మొదటిసారి కాదు. గతంలో కాళికా దేవి ఆలయాన్ని సందర్శించిన సమయంలో సునీతా అహూజా విడాకుల పుకార్లను ఖండించారు.

- August 28, 2025
0
43
Less than a minute
You can share this post!
editor