“గేమ్ ఛేంజర్” సాంగ్ జపాన్ తర్వాత ఇప్పుడు కొరియాలో

“గేమ్ ఛేంజర్” సాంగ్ జపాన్ తర్వాత ఇప్పుడు కొరియాలో

రామ్‌చరణ్  హీరోగా కియారా అద్వానీ హీరోయిన్‌గా దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసమే అని అందరికీ తెలుసు. ఎన్నో అంచనాల మధ్య  ఈ సినిమా నుండి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్ కొట్టాయి. అయితే రెండో సాంగ్‌గా వచ్చిన మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా అయితే స్టార్ట్ అవ్వడమే చార్ట్ బస్టర్‌గా మొదలైంది. అయితే ఫస్ట్ జపాన్ ఆడియెన్స్‌లో వైరల్‌గా మారిన ఈ సాంగ్ ఇప్పుడు సౌత్ కొరియన్ ఆడియెన్స్‌ని ఊపేస్తోంది. మరి కొరియాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ అనే సింగర్ తన టీంతో కలిసి రా మచ్చా మచ్చా సాంగ్ హుక్ స్టెప్‌ని వేశారు. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో చరణ్ ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది. మొత్తానికి థమన్ మ్యూజిక్ చేసిన సాంగ్ భారీ హిట్ అయ్యిందనే చెప్పాలి.

administrator

Related Articles