కంగనా రనౌత్ ఎమర్జెన్సీ తన ఫస్ట్ వీక్ కలెక్షన్లు భారతదేశంలో దాదాపు రూ. 10 కోట్లకు చేరుకుంది. పంజాబ్లోని వివిధ సిక్కు సంఘాల నిరసనల మధ్య ఈ సినిమా విడుదలైంది. భారతదేశంలో ప్రారంభ వారాంతంలో ఎమర్జెన్సీ రూ.10.45 కోట్లు వసూలు చేసింది. నిరసనల కారణంగా పంజాబ్లో సినిమాని రిలీజ్ చేయలేదు. ఈ సినిమాకు కంగనా రనౌత్ దర్శకత్వం వహించింది, ఆమె సినిమాలో ఇందిరా గాంధీ పాత్రను కూడా పోషించింది. నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి వారాంతం పూర్తి చేసుకుంది. ఈ పొలిటికల్ డ్రామా భారతదేశంలో దాదాపు రూ. 10.45 కోట్ల నికర వసూలు చేసింది, ఆదివారం ఒక్క రోజే రూ.4.35 కోట్ల నెట్ని జోడించిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ నివేదించింది.
ఎమర్జెన్సీకి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలు వచ్చాయి. సినిమాలో తీసిన ‘సిక్కు వ్యతిరేక’ కథనానికి వ్యతిరేకంగా సిక్కు సంస్థల నుండి నిరసనలు రావడంతో పంజాబ్లో ఈ సినిమా రిలీజ్ కాలేదు.