‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్స్ అందుకున్న ప్రదీప్ రంగనాథన్ తాజాగా ‘డ్యూడ్’ అంటూ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో మనముందుకు వచ్చాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా మేకర్స్ మంచి బజ్తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా మమితా బైజు నటించింది. కీర్తిశ్వరన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. యూత్ఫుల్ కంటెంట్కు ప్రేక్షకులు కనెక్ట్ కావడంతో ఈ సినిమాను చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీపావళి సెలవులు కూడా ఉండటంతో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 4 రోజుల్లో డ్యూడ్ సినిమా వరల్డ్వైడ్గా రూ.83 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేస్తుందా అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది.

- October 21, 2025
0
34
Less than a minute
Tags:
You can share this post!
editor