కోర్టును ఆశ్రయించిన ధనుష్‌.. నయనతారపై దావా

కోర్టును ఆశ్రయించిన ధనుష్‌.. నయనతారపై దావా

హీరోయిన్ నయనతార.. తమిళ హీరో ధనుష్‌  మధ్య వివాదం మరింత ముదురుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న నయనతార డాక్యుమెంటరీ విషయంలో ధనుష్‌ వెనక్కి తగ్గడం లేదు. ఈ డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా ‘నేనూ రౌడీనే’ సినిమా షూటింగ్‌ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారంటూ రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్‌ ఇప్పటికే డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై ధనుష్‌ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా నేను రౌడీనే సినిమా విజువల్స్‌ను వాడుకున్నారని ధనుష్‌ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో దావా వేసింది. నయనతార దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్‌పై కూడా దావా వేసింది. ధనుష్‌ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. విచారణకు అంగీకరించింది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే, ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన ‘నేనూ రౌడీనే’ సినిమా షూటింగ్‌ క్లిప్పింగ్స్‌ని వాడుకున్నారు. ఆ క్లిప్పింగ్‌ను డాక్యుమెంటరీలో వాడుకునేందుకు అనుమతి లేకపోవడంతో రూ.10 కోట్ల పరిహారం ఇవ్వాలని ధనుష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నయనతారకు లీగల్‌ నోటీసులు కూడా పంపారు. ఈ క్రమంలోనే ధనుష్‌ని లక్ష్యంగా చేసుకొని నయనతార ఓ బహిరంగ లేఖను విడుదల చేసింది. చట్టపరంగా తేల్చుకుంటానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ధనుష్‌ కోర్టును ఆశ్రయించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

editor

Related Articles