ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుండి సినిమా వస్తుందంటే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందనే టాక్ మాత్రమే మొదట వినిపిస్తుంది. బాహబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ తర్వాత అంతకు మించిన ట్రెండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఎస్ఎస్ఎంబీ 29. మహేష్బాబు లీడ్ రోల్లో రాబోతున్న ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్పైకి వెళ్లనున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్కు సంబంధించిన ఆసక్తికర వార్త సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ అదేంటనుకుంటున్నారా..? అదేనండి బడ్జెట్. ఎస్ఎస్ఎంబీ 29 రూ.1,000 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ విషయాన్ని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ చిట్చాట్లో స్పష్టం చేశారు. అంతేకాదు భారీ స్థాయిలో ఉండబోతున్న ఈ చిత్రంలో హాలీవుడ్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు భాగం కాబోతున్నారని చెప్పారు. తమ్మారెడ్డి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండమే కాదు.. సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీని 2027 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.

- November 13, 2024
0
44
Less than a minute
Tags:
You can share this post!
administrator