హీరో చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా ఫ్యాన్సంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒకటి రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ జరుగుతోంది. ‘విశ్వంభర’ సినిమాని 90 శాతం ఇండోర్లోనే తెరకెక్కించారు దర్శకుడు మల్లిడి వశిష్ట. కథానుసారం ఈ సినిమాకు 70 శాతం సీజీ వర్కే ఉంటుంది. అందుకే.. ప్రపంచంలోనే పేరెన్నికగన్న వివిధ స్టూడియోలు ఈ సినిమా సీజీకి వర్క్ చేస్తున్నాయి. వాటినుండి పూర్తి ఔట్పుట్ వచ్చాకే సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించాలనేది ‘మెగా’ ఆదేశం. అందుకు నిర్మాతలు సైతం కట్టుబడి ఉన్నారని సమాచారం.
- June 4, 2025
0
77
Less than a minute
You can share this post!
editor


