పద్మ అవార్డు గ్రహీతలందరికీ మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా స్పందించిన ఆయన, విశిష్ట వ్యక్తులను సత్కరించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ధర్మేంద్రకు లభించిన పద్మ విభూషణ్, మమ్ముట్టీ గారు మరియు డాక్టర్ దత్తాత్రేయుడు నోరి గారికి వచ్చిన పద్మ భూషణ్ పురస్కారాలు వారి దశాబ్దాల అంకితభావం, ప్రతిభకు దక్కిన గౌరవమని అన్నారు. అలాగే మిత్రులు మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్, సోదరుడు మాధవన్, భారత క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ, వరల్డ్ కప్ విజేత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు పద్మశ్రీ లభించడం సంతోషకరమని అభినందించారు. కళలు, విజ్ఞానం, వైద్యం, సాహిత్యం, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో విశేష సేవలు అందించిన 2026 సంవత్సరపు పద్మ అవార్డు గ్రహీతలందరికీ తన అభినందనలు తెలియజేశారు. దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఈ మహానుభావులు మరెన్నో విజయాలు సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.
- January 26, 2026
0
65
Less than a minute
You can share this post!
editor

