ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. స్టార్ హీరోలు లేని సినిమా ఎప్పుడూ కష్టంగా ఆడియన్స్ను ఆకట్టుకుంటుందన్న అభిప్రాయాన్ని ఈ సినిమా తలక్రిందులు చేసింది. కన్నడలో నిర్మితమైన ఈ యానిమేటెడ్ సినిమా, తెలుగులో అల్లు అరవింద్ సమర్పణలో విడుదలై విపరీతమైన క్రేజ్ సంపాదించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే రూ.230 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారతదేశంలో అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన యానిమేటెడ్ సినిమాగా ఘనత సాధించింది. ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా హౌస్ఫుల్ షోలతో కొనసాగుతుండటం విశేషం. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా, అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. తాజాగా ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ఈ సినిమాను వీక్షించారు. ఆగస్ట్ 15 నాడు అల్లు అరవింద్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డితో కలిసి థియేటర్లో ఈ సినిమాను చూశారు. అనంతరం ఆయన సినిమా గురించి స్పందిస్తూ.. “మన పురాణాలకు చాలాదగ్గరగా ఈ సినిమా ఉంది. భక్త ప్రహ్లాద సినిమాలా ఇది కూడా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. మనుషులతో కాకుండా బొమ్మలతో తీశారు గానీ… ఆ భక్తి, ఆ భావం, ఆ అనుభూతి మాత్రం నిజంగా ఆధ్యాత్మికంగా అనిపించింది. చివరి సన్నివేశం అత్యంత అద్భుతంగా ఉంది. ఇది ప్రతి కుటుంబం థియేటర్లో చూసే సినిమా అని ప్రశంసించారు.

- August 16, 2025
0
57
Less than a minute
Tags:
You can share this post!
editor