బ్రహ్మానందం, ఆయన కొడుకు రాజా గౌతమ్ మెయిన్ రోల్స్లో యాక్ట్ చేస్తున్న సినిమా ‘ఆనందమానందమాయే’. ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇటీవల ‘ఆనందమాయే..’ అనే పాటను రిలీజ్ చేశారు. శాండిల్య పీసపాటి స్వరపరచిన ఈ పాటను శ్రీసాయి కిరణ్ రచించగా, మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ పాడారు. భిన్న వ్యక్తిత్వాలు కలిగిన నాయకానాయికల మధ్య ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య.

- January 11, 2025
0
31
Less than a minute
Tags:
You can share this post!
editor