భార‌త సైన్యంపై న‌మ్మ‌కం ఉంది అన్న అనుప‌మ్ ఖేర్

భార‌త సైన్యంపై న‌మ్మ‌కం ఉంది అన్న అనుప‌మ్ ఖేర్

భారత్ – పాకిస్థాన్ మధ్య భీక‌ర‌ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్థాన్ ఇండియాలోని 15 నగరాలపై దాడులు చేస్తుంటే, భారత్, పాక్ లోని 9 నగరాలపై దాడుల‌కి దిగింది. పాక్ 50కి పైగా డ్రోన్ల‌ని భార‌త్‌పైకి ప్ర‌యోగించింది. మ‌న ద‌గ్గ‌ర S400 అనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టం ఉండ‌డంతో పాకిస్థాన్ నుండి వస్తున్న మిస్సైళ్లను అడ్డుకుంటోంది. అలాగే.. డ్రోన్లను కూడా అడ్డుకొని నాశనం చేస్తోంది. భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ ఉలిక్కి పడింది. ముఖ్యంగా పాక్ రాజధాని షెహబాజ్‌కి షరీఫ్‌ని తీసుకుని సురక్షిత ప్రాంతంలో ఉంచింది. పాకిస్థాన్ ప్రధానంగా.. జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో కాల్పులు జరుపుతోంది. మీరూ మీ కుటుంబం సురక్షితంగా ఉన్నారా అని ఫోన్ చేసి అడిగా. ఆయన గర్వంగా నవ్వి, ‘భయ్యా, మేము ఇండియాలో ఉన్నాం. మేము హిందుస్తానీలం. భారత సైన్యం, మాతా వైష్ణోదేవి మమ్మల్ని కాపాడుతున్నారు. నువ్వు ఎలాంటి టెన్షన్ పడకు. ఏ క్షిపణిని నేల మీద పడనివ్వం. జై మాతా దీ. భారత్ మాతాకీ జై అని అన్నాడ‌ని అనుమ‌ప‌మ్ ఖేర్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఆప‌రేష‌న్ సింధూర్ త‌ర్వాత కూడా అనుప‌మ్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. భారత్ మాతా కీ జై #ఆపరేషన్ సింధూర్ అని పేర్కొన్నారు. కశ్మీరీ పండిట్ కుటుంబం నుండి వచ్చిన అనుపమ్ ఖేర్ సిమ్లాలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు కశ్మీర్‌వారు.

editor

Related Articles